మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట ఏప్రిల్ ( 03 ) ఆదివారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట
ఏఐటీయూసీ అనుబంధ.గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశం మందలపల్లి గ్రామ పంచాయతీలో జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు శ్రామ దోపిడీకి గురవుతున్నారని వారిని గొడ్లు కంటే హీనంగా చూస్తున్నారని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేపిస్తున్నారని చాలీ చాలని వేతనాలు ఇచ్చి శ్రమ దోపిడీ జరుగుతుందని ప్రతి కార్మికుడికి 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆరోగ్య రక్షణ కల్పించాలని ప్రతి ఒక్కరికి సిపిఆర్ లిస్టులో పేరు నమోదు చేయించాలని ప్రతి ఒక్క పంచాయతీలో ప్రతి కార్మికుడికి తీర్మానం కాఫీలు ఇవ్వాలని కొన్ని పంచాయతీల్లో అతి తక్కువ 5 వేల నుంచి 6000 4000 ఇస్తున్నారని ప్రతి కార్మికుడికి ప్రభుత్వం ప్రకటించిన 8500 తక్షణం ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం లో భాగంగా నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పందేటి చెన్నారావు పేరుమల రాంబాబు ప్రభాకర్ .శ్రీను .చిన్న గొరిపాటి బసవయ్య . గుడా వెంకటేశ్వరరావు సహదేవుడు నరసమ్మ 31 ఒక గ్రామ పంచాయతీ వర్కర్స్ పాల్గొన్నారు
Post A Comment: