మన్యం మనుగడ వెబ్ డెస్క్:
భద్రాచలం ఏప్రిల్ 6 జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం శ్రీ సీతా రామ చంద్ర స్వామి కల్యాణం, శ్రీ రామ నవమి కి భద్రాచలం విచ్చేసే భక్తులకు వేసవికాలం దృష్ట్యా 10 వేల మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు జేడీ ఫౌండేషన్ ద్వారా సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందించడం జరిగింది దానికి వారు ఆమోదించడం కూడా జరిగింది. అలాగే పౌండేషన్ ద్వారా "శ్రీరామ కార్యం" సేవలకు జేడీ ఫౌండేషన్ సభ్యులకు ఎంట్రీ పాసుల కోసం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ బి. శివాజీ కి దరఖాస్తు చేయడం జరిగింది దానికి కూడా వారు ఆమోదించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ కంభంపాటి సురేష్ కుమార్ నాని కడాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: