- అనంతరం గుబ్బలమంగమ్మ తల్లిని దర్శించుకున్నా ఎంఎల్ఏ మెచ్చా
అశ్వారావుపేట: వనబందు కళ్యాణ్ యోజన ద్వారా రూ 5 లక్షలు, భద్రాచలం ఐటిడిఎ ప్రత్యేక నిధులు ద్వారా మరో రూ.5 లక్షల తో గుబ్బలమంగమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ మంజూరు కావడంతో బుధవారం అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్థానికులతో కలిసి స్థల పరిశీలన చేశారు. అనంతరం గుబ్బలమంగమ్మ తల్లి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతు గుబ్బలమంగమ్మ తల్లి ఆశీసులు ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు నారం రాజశేఖర్, నారాయణపురం సొసైటీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, మండల సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్, కలపాల శ్రీను, చెన్నంశెట్టి నరసింహులు, ప్రదీప్, ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: