భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలోన కోయగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్.ఐ సముద్రాల జితేందర్ ఆదేశానుసారం అదనపు ఎస్.ఐ కాజా నజిరుద్దీన్ ఆధ్వర్యంలో ప్రగతి ట్రాన్స్పోర్ట్ క్యాంప్ వాసులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు,పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు ముఖ్యంగా యువత మరియు క్యాంప్ వాసులు అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల జరిగే అనర్ధల గురించి వివరించారు.చెడు అలవాట్లకు ముఖ్యంగా గంజాయి,మద్యం,గుట్కాలకు బానిసలుగా మారి కుటుంబాలకు దూరం కావద్దని దీంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తిని మూల పడే అవకాశాలు మెండుగా ఉంటాయి అని మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మన ప్రాణమే కాక ఎదుటి వాహన దారులకు కూడా ప్రాణ హాని పొంచి ఉంటుందని తెలిపారు.ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెంట్ లు ధరించి నడపాలని అదే విధంగా పెండింగ్ చలానాలను ప్రభుత్వం కల్పించిన రాయితి లో కట్టుకుంటే కలిగే ప్రయోజనం గురించి వివరించారు.పరుగు రాష్ట్రల నుండి జీవనం సాగించేందుకు వచ్చిన కుటుంబాలు వాహన ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువ మొత్తంలో ట్రాలి వాహనంలో ప్రయాణం చేయవద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఐ తో పాటు కనిస్టేబుల్ వీరబాబు అదేవిధంగా క్యాంప్ వాసులు పాల్గొన్నారు.
Post A Comment: