మన్యం మనుగడ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని మద్దులగూడెం డబుల్ బెడ్ రూమ్ ఇల్లవద్ద టియస్ 25 టి 5686 నెంబర్ గల ట్రాలీ టాటా మ్యాజిక్ అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయానిస్తున్న ప్రయాణికులలో ఇద్దరు మహిళలు అక్కడికి అక్కడే మృతి చెందగా ఇరవై మందికి గాయల పాలయ్యారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.గుండాల మండలం దామారతోగు గ్రామనికి చెందిన కల్తి కృష్ణరావు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో, బంధువులతో కలిసి అళ్లపల్లి మండలం లొద్దిగూడెం గ్రామంలో రెక్కలరామయ్య గుడికి బయలుదేరి మొక్కలు తీర్చుకోని తిరుగు ప్రయాణంలో కరకగూడెం మండలపరిదిలోని మద్దెలగూడెం గ్రామంలో గల డబుల్ బెడ్ రూమ్ ఇల్ల సమీపంలో బోలోరా వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న తాడ్వాయి మండలం వీరపూరం గ్రామనికి చెందిన గుమ్మడి స్వర్ణ(30)సం,,గుండాల మండలం వెంకటపూరం గ్రామనికి చెందిన సుతారి సమ్మక్క(40) సం,,అనే మహిళలు అక్కడికి అక్కడే మృతి చెందారు మిగత ఇరవై మందికి గాయలు అయినట్లు పేర్కొన్నారు.గాయాలు అయిన క్షతగాత్రులను నాలగు 108 వాహనాలలో భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి తరలించారు.
Post A Comment: