మన్యం మనుగడ కరకగూడెం:వరల్డ్ టిబి డే సందర్భంగా కరకగూడెం ప్రభుత్వ వైద్యులు డా,,పర్షియా నాయక్ వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డా,,పర్షియా నాయక్ మాట్లాడుతూ చేయి చేయి కలుపుదాం టిబిని తరిమికొడదాం టిబివ్యాధి వచ్చిందని కుంగిపోకు బిసిజి టీకా వేయించుకో టిబి రాకను నిరోధించు కో అని నినాదాలు చేస్తూ టిబి వ్యాధి పైన అవగాహన కల్పించారు. తేమడ లో రక్తపు చారలు టిబి కి దారితిస్తుందని, రెండు వారాలకు మించి దగ్గు వస్తూ ఉంటే టీబి జబ్బు అనుకోవచ్చు దుమ్ము ధూళి ఉన్నాకూడా టిబి వస్తుంది బరువు తగ్గిన గాలి వెలుతురు సరిగా లేకపోయినా టిబి రోగానికి దారి తీస్తుంది. టిబి వచ్చింది కదా అని భయపడాల్సిన అవసరం లేదు బి సి జి టిక వేయించుకొని పూర్తి కాలం మందులు వాడితే వ్యాధి నుండి విముక్తి పొందవచ్చు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: