గుండాల మార్చి 23(మన్యం మనుగడ) మండలంలోని అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడాలని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని మండల అభివృద్ధి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఎంపీడీవో హజరత్ వాలి తో ప్రత్యేక సమావేశమైన ఆయన మండలంలోని ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించే విధంగా సిబ్బందికి ఆదేశించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హజరత్ వాలి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: