CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవ ధర్మం :-సివిల్స్ విద్యార్థి సుధాకర్.

Share it:

  


గుండాల మార్చ్ 13( మన్యం మనుగడ) ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవ ధర్మం అని సివిల్స్ విద్యార్థి పాయం సుధాకర్ అన్నారు. మండలం పరిధిలోని వేపాలగడ్డ గ్రామానికి చెందిన ఆయన సుధాకర్ హైదరాబాద్ లో ఉంటూ సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ మండలంలో పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు ఆదివారం జగ్గయ్య గూడెం ప్రభుత్వ పాఠశాలకు 2 సిమెంట్ బెంచీల ను అందించారు. వాటితో పాటు నర్సాపురం తండాకు చెందిన బాలాజీ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఆపదలో ఉన్న వారిని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాయం నరేష్ , చింత సురేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: