మన్యంటీవి, అశ్వారావుపేట:అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబానికి ఆదివారం జమాతే ఉల్ మా కమిటీ ఆధ్వర్యంలో వితరణ అందించారు. అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామానికి చెందిన ఎస్కె మోతు ఇల్లు ప్రమాదవశాత్తు దగ్దం కాగా, ఈ విషయం తెలుసుకున్న కమిటీ బాద్యులు అంతా కలిసి ఎస్ఐ రామ్మూర్తి చేతుల మీదుగా 50 కేజీల బియ్యం, నెలరోజులకు సరిపడ నిత్యావసర సరుకులు, దుప్పట్లు, దుస్తులు, కోడిగుడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖత్మేను బువ్వత్, మౌలానా అబ్దుల్ హఫీజ్, ఎస్కె సాజిత్ పాషా, ఎస్కె బాజీ, జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: