CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అగ్నిప్రమాదంలో ఇల్లు కాలిపోయిన కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసి ఆదుకున్న ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

 


మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, అసుపాక గ్రామంలో షేక్ మక్తుంబీ అనే మహిళ ఇల్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ఉన్న ఇల్లు కాలిపోయి దిక్కు తొచక ఆర్ధికంగా సతమతం అవుతున్న ఆ కుటుంబ పరిస్థితిని తెరాస సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎంఎల్ఎ మెచ్చా వెంటనే స్పందిచి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశం మేరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తనయుడు మెచ్చా రాము, మేనల్లుడు తాటి ప్రదీప్, మెచ్చా రఘు బాధిత కుటుంబానికి పరామర్శించారు. తక్షణ సహాయంగా వంట సామాగ్రి, బియ్యం, పచారీ సామగ్రి, చీరలు, దుపట్లు సహాయం చేశారు. అలాగే పభుత్వం పరంగా వచ్చే డబుల్ బెడ్రూం ఇల్లు కూడా త్వరలో మంజూరు అయ్యేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ నాయకులు మందపాటి మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు, కాసాని చంద్ర మోహన్ వెయ్యి రూపాయలు, గుడవర్తి వెంకటేశ్వరావు వెయ్యి రూపాయలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో మండల సెక్రెటరీ వెంకన్న బాబు, ఉద్యమ నాయకులు ముబారక్ బాబా, వీర్నాల హరిప్రసాద్ , తల్లడ వెంకటేశ్వరరావు, షేక్ అట్టావలా, పార్టీ ప్రెసిడెంట్ నల్లపు చంద్రరావు, కసిం, వలి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: