మన్యం టీవీ చర్ల:
చర్ల మండలంలోని చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ లెక్చరర్గా విదులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వెంకటేశ్వర స్వామి ఆత్మీయ వీడ్కోలు సభ సోమవారం కళాశాల ఆవరణలో జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరయిన చర్ల మండల మున్నూరుకాపు సంఘం అద్యక్షుడు విస్సా నాగభూషణం మాట్లాడుతూ గత రెండున్నర దశాబ్దాలుగా వెంకటేశ్వర స్వామి లెక్చరర్గా చేసిన సేవలను గుర్తు చేసారు. కళాశాల ఉపన్యాసకులుగా స్వామి ఎంతో మందికి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దారని అన్నారు. స్వామితో తనకు వ్యక్తిగతంగా గల అనుభందాన్ని గుర్తుచేసుకున్నారు. సర్వీసు మొత్తం కాంట్రాక్ట్ లెక్చరర్ గా పూర్తి చేసుకున్న స్వామి కి కుటుంబ ఖర్చుల కొరకు రూ. 10 వేల రూపాయల వితరణగా అందచేసారు.
Post A Comment: