మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తాసిల్దార్ కార్యాలయంలో రాత్రి పూట విధులు నిర్వహిస్తున్న వి ఆర్ ఏ దుర్గం బాబును గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేయడం జరిగింది.ఇట్టి విషయమే పినపాక వి ఆర్ ఏ సంఘం ఆధ్వర్యంలో విఆర్ఏ హత్యను ఖండిస్తూ హత్యకు కు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని,అదేవిధంగా దుర్గం బాబు కుటుంబానికి 50 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియాను వెంటనే ఇవ్వాలని మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని పినపాక మండలం తహసిల్దార్ కు మెమోరాండం ఇచ్చి నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొండయ్య, ఉపాధ్యక్షుడు రోశయ్య, విఆర్ఏలు జగదీష్, నరసింహ రావు,చందర్ ర్రావు,ఝాన్సీ,వెంకట్,సౌందర్యం,రమణ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: