CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అంబేద్కర్ భవన్ కు తగిన స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల రవీందర్.

Share it:

 


మన్యం మనుగడ, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి

కొత్త దామోదర్ గౌడ్

అంబేద్కర్ భవన్ కి స్థలం కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల రవీందర్ ఆధ్వర్యంలో కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొత్త అంబేద్కర్ భవన్ కి నిధులు మంజూరు ఐ ఉన్నప్పటికీ స్థలం కేటాయించక పోవడం వల్ల కొత్త అంబేద్కర్ భవన్ నిర్మాణం జరగడం లేదని కావున జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్ కు తగిన స్థలాన్ని కేటాయించాలని అదేవిధంగా పాల్వంచలో కూడా నిధులు మంజూరు అయినప్పటికీ అంబేద్కర్ భవన్ కి స్థలం కేటాయించలేదని అదేవిధంగా భద్రాచలంలో అంబేద్కర్ భవన్ కి కోటి రూపాయలు మరియు స్థలం కేటాయించి ఉన్నప్పటికీ నిర్మాణానికి నోచుకోవడం లేదని కావున పై సమస్యలపై స్పందించి దళితుల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లను నిర్లక్ష్యానికి గురి చేయకుండా చూసి దళిత గిరిజనులు అందరికీ ఆత్మ గౌరవం గా ఉపయోగపడే ఇటువంటి అంబేద్కర్ భవన్లో ను తక్షణమే నిర్మాణం చేపట్టాలని కోరడం జరిగింది .దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే నిర్మాణాలు చేపట్టాలని స్థలం కేటాయించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది .దీనికి మాల మహానాడు తరఫున జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్త గూడం నియోజకవర్గ అధ్యక్షులు గుడివాడ రాము ఉపాధ్యక్షులు పగిడిపల్లి శ్రీకాంత్ కోశాధికారి కృష్ణ గిరిజన సంఘం నాయకులు లాల్ సింగ్ భూక్య రవి తదితర దళిత గిరిజన నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: