మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల కాలనీ లో అశ్వాపురం పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్తు పదార్దాలకు అలవాటు పడకుండా ఉండేందుకు అవగాహనా సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని అశ్వాపురం సిఐ సిహెచ్. శ్రీనివాసు మాట్లాడుతూ యువత ఎక్కువగా మందు గుట్కా గంజాయికీ బానిస కావద్దు అని అందరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని, గొడవలకీ వెళ్ళవద్దని యువత కు తెలపటం జరిగింది. అదేవిధంగా మత్తు కి బానిస అయితే జీవితం చిత్తు చిత్తు అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పినపాక నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు, చింతిర్యాల కాలనీ ఉప సర్పంచ్ వెన్న అశోక్ కుమార్, మండలం ఎస్సీ విభాగం ప్రధానకార్యదర్శి వల్లెపోగు రాము యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: