మన్యం మనుగడ, ములకలపల్లి:
ములకలపల్లి మండల కేంద్రంలో లో మండలంలోని 20 గ్రామ పంచాయతీ కార్మికులు రైతు వేదిక వద్ద సమావేశమై కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీడీవో కి వినతిపత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని. జీవో నెంబర్ 60 ప్రకారం పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని. పదకొండవ పిఆర్సి ప్రకారం పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని. రెండు లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని. 15 వేల ఆరు వందలు జీతం పెంచాలని ఎంపీడీవో కి వినతి పత్రం ఇవ్వడం అయినది. ములకలపల్లి సాయిబాబా గుడి నుండి ఎంపీడీవో ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి వినతి పత్రం అందజేశారు.
పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షునిగా చిక్కుల శ్రీనివాసరావు,కార్యదర్శిగా సుంకర ప్రసాద్ గౌడ్
పంచాయతీ కార్మికుల మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. పంచాయతీ కార్మికులు మండల అధ్యక్షునిగా చిక్కుల శ్రీనివాసరావు. కార్యదర్శిగా సుంకర ప్రసాద్ గౌడ్ ను. గౌరవ అధ్యక్షులుగా మహమ్మద్ యూసుఫ్ ను ఎన్నుకోవడం జరిగినది. ఉపాధ్యక్షుడిగా మరియు రాం సురేష్. కొక్కెర గడ్డ సతీష్. సహాయ కార్యదర్శులు గా శంకర్. బొబ్బిలి బాబురావు లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాంబాబు గద్దల మహేష్. ప్రసాద్ ప్రసాద్. చీకటి సత్యనారాయణ. చిట్టి రామకృష్ణ సంజీవ రావు. చల్ల జయరాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: