- నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి కొరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం
మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:తెలంగాణ ప్రభుత్వ విప్ , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతకు టెక్నాలజీ సంబంధిత విభాగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ద్వేయంగా హైదరాబాద్ కి చెందిన ఐటి సంబంధిత పిక్సెల్, కలర్ స్కై టెక్నాలజీస్ సంస్థల భాగస్వామ్యం తో అశ్వాపురం మండల కేంద్రంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తద్వారా ఎంతో మంది యువతీ యువకులు ఉపాధి శిక్షణ పొందే అవకాశం కల్పించబోతున్నారు. అందుకొరకు సోమవారం హెదరాబాద్, లక్ది కపూల్ లోని అశోక హోటల్ లో దానికి సంబంధించిన పోస్టర్ ను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవిష్కరించారు. అందుకోసం రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ మరియు కలర్ స్కై టెక్నాలజీస్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో పిక్సెల్, కలర్ స్కై టెక్నాలజీస్ సంస్థల ప్రతినిధులు, నేహా బండారి, కొండా శ్రీనివాస్, అవినాష్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరెందర్, నాయకులు లంకెల రమేశ్ ,జాలే శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: