CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెంచిన కరెంటు చార్జీలు, ధరలను వెంటనే తగ్గించాలి.కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధర్నా, రాస్తారోకో.

Share it:




మన్యం మనుగడ మంగపేట.

 ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క, ములుగు జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారమస్వామి ఆదేశాల మేరకు శుక్రవారం మంగపేట మండల కేంద్రం లోని గంపోనిగూడెం వై జంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మైల జైరాంరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వందలాది మంది పెరిగిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ కరెంట్ చార్జీల ధరలను వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా,రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు భారం పెంచే విధానాన్ని అవలంబిస్తున్నాయని, పేదోడి నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు.అలాగే యాసంగి సీజన్ లో రైతులు వరి పంట వేస్తే ఉరి అని అన్న ముఖ్యమంత్రి,ప్రధాని ఇప్పుడు మీరు అంటే మీరు అని ఒకరి మీద ఒకరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దొంగ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. అనంతరం పోలీసులు ధర్నా,రాస్తారోకో చేస్తున్న నేతలు, కార్యకర్తలని చెదరగొట్టారు.

Share it:

TS

Post A Comment: