గుండాల మార్చి 9 (మన్యం మనుగడ) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ ఆశయాలను కొనసాగిస్తామని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. బుధవారం ఆయన ఆరో వర్ధంతి కార్యక్రమాలను గుండాల, కాచన పల్లి గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉండి ఉద్యమాలను కొనసాగించాలన్నారు. పీడిత ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వారికి విముక్తి కలిగించారు అన్నారు. ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజా పోరాటాల్లో ముందు ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై వెంకన్న, జర్పుల కిషన్, ఎస్ కె అజ్గర్, బానోతు లాలు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: