- ఆదివాసి జేఏసీ ములకలపల్లి,సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి కి శవ యాత్ర నిరసన ములకలపల్లి:మర్చి21(మన్యం మనుగడ)ప్రతినిధి:న్యూస్:
ములకలపల్లి మండల కేంద్రం లో త్రి దండి చిన జీయర్ స్వామి శవయాత్ర నిర్వహించారు. మేడారం లో కొలువైన ప్రకృతి వన దేవతాలు సమ్మక్క-సారక్క లపై జన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ములకలపల్లి జె.ఎ.సి,సర్పంచులు సంఘ అద్వర్యం లో చినజీయర్ సవాని శవ యాత్ర నిర్వహించారు.ఈ శవయాత్రలో భాగంగా నాయకులు మడకం చిరుమప్ప మాట్లాడుతూ ఆసియా ఖండంలోని రెండవ అతిపెద్ద జాతరను చూస్తూ ఉండేసరికి స్వామికి కళ్ళు బైర్లు కమ్మి ఇలాంటి వ్యాఖ్యలు చేసారని,సమ్మక్క సారలమ్మ తల్లి ఆదివాసీలకు ఇలవేల్పు.ఆదివాసుల ఇలవేల్పు ల ఆత్మగౌరవాన్ని కించ పరిచిన చిన్న జీయర్ స్వామి వెంటనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివాసులు కొలిసే దేవత మూర్తులందరికీ రూపం ఉండదని స్వాములవారు గుర్తించాల్సింది గా తెలిపారు.సమత మూర్తి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న స్వాముల వారికి ఆదివాసీల చెట్టు పుట్ట ఉన్నటువంటి మా తల్లుల గురించి పూర్తిగా తెలియక పోవడం బాధాకరమన్నారు.అడవిలో స్వాముల వారికి వ్యాపారం చేయడానికి అనుకూలంగా లేదని ఇలాంటి నీచపు మాటలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.త్రిదండి చిన్న జీయర్ స్వామి మీరు ఎప్పటికైనా,మేడారం వచ్చి ఆ తల్లులను క్షమాపణ కోరితే తప్ప మీకు ఉన్న దోషాలు పోతాయని హితవు పలికారు.ఈ కార్యక్రమం లో ఎంపిపి మట్ల నాగమణి,సర్పంచ్ లు సుధీర్, రాజేష్, కీసరి శ్రీనివాస్, సుధాకర్, నాగరాజు గారు,భీబినేని భద్రం, గడ్డంభవాని,కుంజ నాగమణి, సుశీల, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్రం నరసింహారావు, తుర్రం శ్రీను,కుంజా వెంకట్,వెలకం వెంకట్,కొండ్రు భాస్కర్,దుబ్బా నరసింహారావు,తెరాస యూత్ నాయకులు తాటి ప్రవీణ్, సమ్మక్క సారలమ్మల పూజారులుతదితరులు పాల్గొన్నారు.
Post A Comment: