CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చైతన్యుడికి డాక్టరేట్.....

Share it:


భద్రాచలం మార్చి 12 అహోబిల మఠం ప్రధాన అర్చకులు, శ్రీనృసింహ సేవా వాహిని వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య హైదరాబాద్ లోని శ్రీ సుందరయ్య కళా విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ మాన్ చేతుల మీదుగా జ్యోతిష్య శాస్త్రం లో డాక్టరేట్ అందుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జ్యోతిష్యం అనేది మూఢనమ్మకం కాదని శాస్త్రం ప్రకారం కాల గమనాలను తెలియజేసి పరిస్కార మార్గాన్ని చూపే గొప్ప ఆయుధం జ్యోతిష్యం అని అన్నారు.ఒక వైపు నృసింహ సేవా వాహిని సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నామని హరిజన గిరిజన గ్రామాల్లో మూఢనమ్మకాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నామని ప్రతి నిత్యం సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ధర్మపరిరక్షణ కొరకు పాటుపడటమనేది నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నానని మున్ముందు గ్రామ గ్రామాన ధర్మపరిరక్షణ కొరకు వాలంటీర్లను నియమించి హైందవ ధర్మపరిరక్షణ కొరకు ప్రతి నిత్యం పాటుపడటానికే కాబోలు భగవంతుడు ఈ డాక్టరేట్ ఇచ్చి నా భాద్యతను మరింత పెంపొందింప చేశాడని అన్నారు.ఈ కార్యక్రమం లో ప్రముఖ జ్యోతిష్య పండితులు డా.శంకర మంచి రామకృష్ణ డా.నాగుల పల్లి. మహేష్ చందర్ భరద్వాజ్,నృసింహ సేవావాహిని సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: