CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలు ఘనంగా జరుపుకోవాలి.మహిళాబందు సంబరాలను విజయవంతం చేయండి ఎంపీపీ రేగా కాళిక.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: ఈనెల 8 తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని 6 వ తారీకు నుండి 8వ తారీకు వరకు మహిళా బందు సంబరాలు జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ మహిళ మండల అధ్యక్షురాలు కాసు లావణ్య ఎంపీపీ రేగా కాళిక పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళ కోసం ఆడపిల్లలు పుట్టినప్పటినుండి చదువు, పెళ్లిళ్లకు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లనీరు, మహిళల కోసం షీటీమ్స్, ఒంటరి మహిళలకు పెన్షన్ పోలీస్ శాఖలో 33శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. అలాగే మూడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలను వారు వివరించారు.6 వ తేదీన సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టడం,7వ తేదీన కల్యాణలక్ష్మి కెసిఆర్ కిట్ షాదీ ముబారక్ తదితర పథకాల ద్వారా లబ్ది పొందిన కుటుంబాలను కలిసి ఫోటోలు దిగడం 8 వ తేదీన పెద్ద ఎత్తున మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ మూడు రోజుల సంబరాలలో ప్రతి ఒక్క మహిళ పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఎంపిటిసి శైలజ,రాచర్ల రమాదేవి, జ్యోతి, కమ్రాక్,మండల యువజన అధ్యక్షులు గుడ్ల రంజీత్ కుమార్, కనకయ్య,చొప్పాల ఉపసర్పంచ్ బోడా ప్రశాంత్,చప్పిడి వెంకటేశ్వర్లు, గోగు వెంకటేశ్వర్లు మహిలలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: