అన్నపురెడ్డిపల్లి(మన్యం మనుగడ న్యూస్)::భక్తుల కోరికలు తీరుస్తూ..మండలంలోని జానకిపురం గ్రామంలో వెలసియున్న దుర్గాస్వరూపిణి అవతారమైన సత్యమ్మ తల్లి షష్టమ వార్షికోత్సవాలను శనివారం నాడు గ్రామస్తులంతా మేళతాళాల ధ్వనుల మధ్య అమ్మవారికి అలంకరణ,ప్రత్యేక అభిషేకములు,అష్టోత్తర కుంకుమ పూజలతో గ్రామ బోనాలు సమర్పించి..మహా అన్నదాన కార్యక్రమాలతో దేవాలయ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు,భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు.అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.వార్షికోత్సవాల కార్యక్రమంలో మెచ్చా వెంట తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు,తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల ఉపాధ్యక్షులు కొత్తూరు వెంకటేశ్వరరావు,నాయకులు పి వెంకటేశ్వరరావు,మానికల రాంబాబు,నేరెళ్ల లాలయ్య,చల్లా రాంబాబు,వాడే రాంబాబు,వీరబోయిన వెంకటేశ్వర్లు,సడియం వెంకటేశ్వర్లు తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: