గుండాల /ఆళ్ల పల్లి మార్చ్ 5 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని రాఘవాపురం
పంచాయతీ లో పోడు భూములో కందకాలు తీయకుండా నిలుపుదల చేయడం కోసం పేసా అత్యవసర గ్రామ సభ నిర్వహించరు. అనంతరం ఎంపీపీ మంజుభార్గవి మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు ఎన్ని సార్లు చెప్పిన కందకాలు తీస్తున్నారని గ్రామ సభ అనుమతి లేకుండా ఎలా తీస్తారు ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తున్నాము అంటే ఫారెస్ట్ అధికారులు అతి ఉత్సాహం తో కందకాలు తీయటం ఏమిటని ఆమె గ్రామ సభలో కందకాలు తీయకుండా తీర్మానం చేశామని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రేమ కళ , అటవి అధికారులు నీలయ్య , శరత్ పీసా కమిటీ సభ్యులు, ఎఫ్ .ఆర్ .సి కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: