CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజెన్సీ గ్రామాలలో ..ఇంటింటి రక్త నమూనాల సర్వే

Share it:


 

 మన్యం మనుగడ/వాజేడు: 


కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రయోగాత్మక సర్వే నిర్వహిస్తోంది వైద్యాధికారులు తహసిల్దార్ ఆధ్వర్యంలో మండలం వ్యాప్తంగా వైద్య బృందాలు..సిరో ప్రొవిలెన్స్‌ సర్వే చేపట్టాయి.పలు గ్రామాలలో గుమ్మడి దొడ్డి, గొల్లగూడెం, చెక్కపల్లి, చెరుకూరు పలు గ్రామాలలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నాయి.ఈ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో కరోనా ప్రభావాన్ని అంచనా వేసి తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం.. మరిన్ని వ్యూహాలు రూపొందించే అవకాశముంది. ఏజెన్సీ గ్రామాలలో వైద్యాధికారులు తహసిల్దార్ అల్లం రాజ్ కుమార్ అధికారులు రక్త నమూనా సేకరణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఈ పరీక్షలు.. ప్రజల రోగనిరోధకశక్తిని అంచనా వేయడంతో పాటు వైరస్‌ లక్షణాలు కన్పించని వారిని గుర్తించేందుకు దోహదపడతాయి. ఇలా సేకరించిన వివరాలను ప్రభుత‌్వం విశ్లేషించి..తదుపరి చేపట్టాల్సిన చర్యలను రూపొందించేందుకు వీలుపడుతుంది.ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని యమున,తహసిల్దార్ అల్లం రాజ్ కుమార్, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, తహసిల్దార్ అల్లం రాజ్ కుమార్, ఆశాలు,హెల్త్ వర్కర్స్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: