మన్యం మనుగడ/వాజేడు:
వాజేడు మండల కేంద్రంలో సి/39 బిఎన్, సి ఆర్ పి ఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏజెన్సీ గ్రామాలైన లక్ష్మి పురం, ఎడుజర్ల పల్లి, వాజేడు నాగారం,పలు గ్రామాలలో నుంచి నిరుపేద వృద్ధులు దివ్యాంగులకు చెందిన నిరుపేద కుటుంబాలకు దోమతెరలు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండటం కోసం పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అలాగే సోలార్ లైట్లు, దేశ నలుమూలల నుండి సమాచారం తెలుసుకోవడానికి, రేడియోలు,వృద్ధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాజేడు ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు, సర్పంచ్ బుల్లె శ్వరరావు, సర్పంచి వాసం మల్లేశ్వరి,సిఆర్పిఎఫ్ సి/39 బిఎన్ ఇన్స్పెక్టర్ థాయర్ అహ్మద్, వెంకట్ శేషయ్య ,సిఆర్పిఎఫ్ జవాన్లు మరియు సివిల్ పోలీసులు పాల్గొన్నారు.
Post A Comment: