మన్యం మనుగడ: ప్రతినిధి:(చండ్రుగొండ):మార్చి22:
టిఆర్ఎస్ నాయకులు గూగులోత్ బాలునాయక్ ఆశయాలను కొనసాగిస్తామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. టేకులబంజర గ్రామంలో జరిగిన బాలునాయక్ వర్ధంతి సభలో ఆయన పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. బాలునాయక్ మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ బాలునాయక్ గ్రామ స్థాయి నుండి ఎంపిపి పదవిని చేపట్టి చిన్నవయసులోనే కరోనాతో చనిపోవడం విచారకరమన్నారు ఆయనతో పాటు ఆయన తల్లి గూగులోత్ గాంగ్లీ (67) సైతం అకాల మరణం మృతి చెందటం విషాదకరమన్నారు.ఈ సభలో ఆయనతోపాటు అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, జారే ఆదినారాయణ,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు,బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, జెడ్పిటిసి కొనకొండ్ల వెంకటరెడ్డి,రాష్ట్ర నాయకులు తాళ్లూరు వెంకటేశ్వర రావు,మేడ మోహన్ రావు,జెడ వెంకయ్య,పైడి వెంకటేశ్వరరావు, దొడ్డకుల రాజేశ్వరరావు,వారది సత్యనారాయణ,గాదె శివప్రసాద్, భానోత్ కుమారి,సత్తి నాగేశ్వరరావు భూపతి శ్రీనివాసరావు,ఉన్నం నాగరాజు,సూర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: