గుండాల మార్చి12 (మన్యం మనుగడ) మండల కేంద్రంలోని గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు బి.గణేష్ , బి. గోపి బీహార్ రాష్ట్రంలో నీ దర్భంగా సిటీలో జరిగిన 26 వజాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అందుకు శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రిన్సిపాల్ హరికృష్ణ మాట్లాడుతూ తూ ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందని క్రీడాకారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. క్రీడాకారుల లోని నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా క్రీడలో రాణిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి.రమేష్ ,వి. సత్యనారాయణ, కళాశాల పిడి మరియు బోధన సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: