మన్యంమనుగడ వెబ్ డెస్క్:
భద్రాచలం పట్టణం: పట్టణంలోని కుమ్మర ప్రజాపతి సంఘం ఆధ్వర్యంలో ... ఆదివారం స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నందు... రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవియత్రి ఆతుకూరి మొల్లమాంబ" జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం నందు "మొల్ల కాంస్య విగ్రహం" ఏర్పాటు చేయాలని సంఘ నాయకులు నిర్ణయం తీసుకున్నారు.... అనంతరం విగ్రహ ఏర్పాటుకై ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది..... కమిటీలో గౌరవాధ్యక్షులుగా పి. సావాల రామ్ ప్రజాపతి, అధ్యక్షులుగా రెల్లి తాతారావు ప్రజాపతి, కన్వీనర్గా విజ్జిగిరి రాజా కిరణ్ ప్రజాపతి, కార్యదర్శిగా ఇందరపు లక్ష్మణ్ ప్రజాపతి, గౌరవ సలహాదారులుగా గంగాధర వీరయ్య ప్రజాపతి, కన్వీనర్గా విజ్జిగిరి రవి ప్రజాపతి, ప్రచార కార్యదర్శిగా జల్లారపు శ్రీనివాస్ ప్రజాపతి, కార్యవర్గ సభ్యులుగా ... కొలిచలం నవీన్ ప్రజాపతి, , గంగాధర సతీష్ ప్రజాపతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ త్వరలోనే "తాడూరు శ్రీను" గారు ఆధ్వర్యంలో "విగ్రహ ఆవిష్కరణ" చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో bsnl సతీష్ ప్రజాపతి, పాపారావు ప్రజాపతి, హరి ప్రజాపతి, నాగచంద్రం ప్రజాపతి , భాస్కర్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: