గుండాల/ ఆళ్ల పల్లి మార్చి 12 (మన్యం మనుగడ) మండలంలోని పోడు రైతుల అందరూ ఏకతాటి మీద నిలవాలని ఆళ్లపల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ పోడు భూములలో కందకాల ను నవ్వకుండా నిలుపుదల చేయాలన్నారు. 2006లో అటవీ హక్కుల చట్టాన్ని అటవీశాఖ అధికారులు ఉన్నారు అలాంటి వారిని విధుల నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామంటే అటవీ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమన్నారు మొత్తం 12 గ్రామాల పరిధిలో 2600 దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది అన్నారు ఎఫ్ ఆర్ సి కమిటీ పంచాయతీ సెక్రటరీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గుర్తించి వాటిని ఫారెస్ట్ అధికారులు లాక్కోవడం చట్టవిరుద్ధం అన్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు తవ్వడం నిలుపుదల చేయాలన్నారు
Navigation
Post A Comment: