మన్యం మనుగడ, పినపాక:
ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లులను హేళన చేస్తూ కక్షపూరితమైన వ్యాఖ్యలు చేసిన చిన జీయర్ స్వామి దిష్టి బొమ్మ ను దహనం చేయటం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దేవనగరం లోని పోలిశెట్టి గుట్టమీద వెలిసిన సమ్మక్క సారలమ్మ దేవతలకు ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో దేవరబాల తోలెం నాగయ్య, సత్యమ్మ దంపతులు పూజలు చేశారు . ఆదివాసీ సంఘాల నాయకులు దేవతలకు పాలాబి షేకం చేశారు. తదనంతరం నాయకులు మాట్లాడుతూ,
చిన జీయర్ అనే దొంగ స్వామీ ఆసియా లోనే రెండవ అతిపెద్ద ఆదివాసీ కుంభమేలాగా పిలిచే సమ్మక్క సారలమ్మ జాతరను వ్యాపార దృక్పధంతో జరుపుతున్నారని, సమ్మక్క సారలమ్మలు అసలు దేవతలు కాదని కించపరిచే వ్యాఖ్యలు చేయటం సబబు కాదని హెచ్చరించారు. ధర్మ ప్రచారం పేరుతో వ్యాపారం చేస్తున్న మొదటి వ్యక్తి నీవేనని , నీకు వేల కోట్ల ధనం ఎట్లా వచ్చిందని ప్రశ్నించారు. సబ్బండ వర్ణాలు పూజించే దేవతలను సమానంగా భావించలేని ఓ దొంగ స్వామీ వెయ్యి కోట్ల విలువచేసే సమతా మూర్తి విగ్రహాన్ని ఏ ఉద్దేశం తో ప్రతిష్టించావని దుయ్యబట్టారు. చిన్న జీయర్ స్వామి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చిన్న జీయర్ స్వామి అక్రమంగా సంపాదించిన ఆస్తులను జాతీయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ కాయం శేఖర్ ,జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొగ్గల ఆర్కే దొర, పినపాక మండల అధ్యక్ష, కార్యదర్శులు కొమరం శ్రీను, కుర్సం సారయ్య, ఆదివాసీ ఐక్య వేదిక అధ్యక్ష, కార్యదర్శులు తోలెం శ్రీను, గొగ్గల కృష్ణ, ఉద్యోగ సంఘం నాయకులు సోలం అశోక్, కొమరం అరుణ్ బాబు, దుబ్బ ముఖేష్, తోలెం జంపయ్య, పోలేబోయిన నరేష్, పాయం సోమయ్య, తోలెం జనార్ధన్ , ఆదివాసీ మహిళలు పెద్దలు గ్రామస్థులు పాల్గొన్నారు.
Post A Comment: