గుండాల మార్చి 19( మన్యం మనుగడ) రోడ్డు ప్రమాదంలో గ్రామీణ వైద్యుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని రేగుల గూడెం గ్రామానికి చెందిన కుంజా వెంకటేశ్వర్లు చెట్టు పల్లి గ్రామం లో ఉంటూ గ్రామీణ వైద్య సేవలు అందిస్తున్నాడు శుక్రవారం అదే గ్రామంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మం తరలించగా అక్కడ వైద్యులు హైదరాబాద్ తీసుకు వెళ్లాలని సూచించారు హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంటికి పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురవుతున్నారు.
Post A Comment: