CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పంచాయతీలో రోడ్లపై పశువుల పెంట కుప్పలు వేయరాదు.అపరిశుభ్రత ... రోగాలకు కారణం

Share it:

 


  • గ్రామాల పరిశుభ్రత కోసం పంచాయతీ ప్రజాప్రతినిధులు,కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలి
  • ఎమ్మెల్యే మెచ్చా నిధుల నుండి 2సిసి రోడ్లను శంకుస్థాపన చేసిన జడ్పిటిసి పైడి వెంకటేశ్వరావు

మన్యం మనుగడ, దమ్మపేట:పంచాయతీలో రోడ్లపై పశువుల పెంట కుప్పలు వేయరాదు అని జేడ్పిటిసి పైడి వెంకటేశ్వరావు సూచించారు.

దమ్మపేట మండలం బాలరాజు గూడెం జగ్గారం పంచాయతీలలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నిధులతో రెండు పంచాయతీలలో సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి పంచాయతీలోను రోడ్లపై గేదలు మేకలు,పెంట కుప్పలు పోయ వద్దని సర్పంచి సెక్రటరీలకు సూచించారు.అపరిశుభ్రత అనేది రోగాలకు ప్రధాన కారణం అని

గ్రామాల పరిశుభ్రత కోసం పంచాయతీ ప్రజాప్రతినిధులు,కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలి అని పిలునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్ , దొడ్డాకుల్ల రాజేశ్వరరావు , ఎంపీటీసీ కృష్ణ , జగ్గారం సర్పంచ్ ఊకే వెంకటేశ్వరరావు , బాలరాజుగూడెం సర్పంచ్ కురసం శ్రీను గ్రామ పెద్దలు శ్రీ రాముల పూర్ణచంద్ర రావు , సారప్పా , పాయం హనుమంత్, గ్రామాల యువకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: