మన్యం టివి, దుమ్ముగూడెం::
ప్రేమోన్మాది శేఖర్ వేదింపులకు తాలలేక ఆత్మహత్య చేసుకున్న ఇర్పా రాధ కుటుంబ సభ్యులను శనివారం నాడు బిఎస్పీ జిల్లా ఇన్ చార్జ్ లు నానమాద్రికృష్ణార్జునరావు, ఇర్పా కామరాజు లు పరామర్శించారు. దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇర్పా రాధ ను పెళ్ళి పేరుతో వేదింపులకు గురిచేసి తన బలవన్మరణానికి కారణ మైన శేఖర్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేయకుండా కుటుంబ సభ్యుల చేత తప్పుడు వాంగ్మూలం రాయించుకొని కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నించడం అనైతికమని తక్షణ మే నిందితున్ని అరెస్టు చేయాలని నానమాద్రి కృష్ణార్జునరావు అన్నారు.లేకుంటే తక్షణ మే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి తడికల శివకుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు పూనెం ముకేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చెన్నం నాగరాజు, నియోజకవర్గ ఇసి మెంబర్ కంచర్ల సింహాద్రి, దుమ్ముగూడెం మండల కన్వీనర్ సరియం భీమరాజు ,తదితర బిఎస్పీ నాయకులు పాల్గొని బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Post A Comment: