గుండాల /ఆళ్లపల్లి మార్చి 23(మన్యం మనుగడ) మండల కేంద్రంలోని భగత్ సింగ్ సూపర్ నుండి బందెలదొడ్డి వరకు సిసి రోడ్డు మంజూరు చేయించిన ప్రభుత్వం పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చిత్రపటానికి టిఆర్ఎస్ శ్రేణులు బుధవారం పాలాభిషేకం చేశారు. అనంతరం మండల అధ్యక్షులు పాయం నరసింహారావు మాట్లాడుతూ. మండలం రేగా నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. అందులో సిసి రోడ్లను మంజూరు చేశారని అన్నారు. ఆళ్లపల్లి మండల అభివృద్ధి కి నిధులు విడుదల చేస్తున్న రేగా కు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి హనుమంతరావు, మండల ప్రధాన కార్యదర్శి బాబా, మైనార్టీ నాయకులు ఆదాం, సర్పంచ్ శంకర్ బాబు, కోపరేటివ్ డైరెక్టర్ హాఫిజ్ , నాయకుడు ఖయ్యుం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: