మన్యం మనుగడ కరకగూడెం:వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవటం వలన వడ దెబ్బ తగిలే అవకాశం ఉందని ఈ వడదెబ్బల వలన భౌతికంగా మాత్రమె కాకుండా, శరీరంలో వివిధ రకాల అవయవాలు, అవయవ వ్యవస్థలు, వాటి విధులు, ముఖ్యంగా నాడీ వ్యవస్థ ప్రమాదానికి గురయ్యే ప్రమాదముందని కరకగూడెం పీహెచ్ సీ వైద్యాధికారి పర్షియా నాయక్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన బుధవారం స్థానిక పిహెచ్ సీలో పలువురు రోగులకు వేసవిలో ఎండ దెబ్బను ఎలా జయించాలో అవగాహన అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో ఇతర ఉష్ణ అనారోగ్యం (హైపెర్థెర్మియా రూపాలు) వేడి తిమ్మిరి, వేడి అలసటలు కలుగుతాయని, చిన్న పిల్లలో మాత్రమె కాకుండా వయసు మీరిన వాళ్ళలో గుండెపోటు వంటి వాటిని కుడా కలిగిస్తుందని హెచ్చరించారు.అంతేకాకుండా వేడిని తట్టుకునేందుకు ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు.ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలని,
పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని ,
రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలని అన్నారు.
ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలని
ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్లు వాడాలన్నారు.
తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలని
ముఖ్యంగా పసి పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు.
ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానాలు ముగించి
పలుచని బట్టలు వేయాలని కోరారు.అనంతరం రోగులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో హెచ్వి భద్రమ్మ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: