CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కార్మికుల హక్కులు కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం. టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి

Share it:

 



 మన్యం మనుగడ, పినపాక : 



కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అన్నారు. సోమవారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెలో పాల్గొని ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులను అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ లక్షల మంది కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. డీజిల్, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను పెంచుతూ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను, అసంఘటిత రంగ కార్మికులపై భారం మోపుతుందన్నారు. కార్మికుల పక్షాన పోరాటాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్దంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆశ వర్కర్‌లకు, అంగన్‌వాడీ టీచర్లకు, మధ్యాహ్న భోజన వర్కర్లకు, పంచాయితీ కార్మికులకు జీతాలు పెంచి తగు న్యాయం చేసిందని, భవిష్యత్ లో కూడా అసంఘటిత రంగ కార్మికులకు టీఆర్‌ఎస్‌ పార్టీనే అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, సొసైటీ వైస్‌ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నర్సింహారావు, నాయకులు గుమ్మడి అశోక్‌, ఉప్పాక ఉపసర్పంచ్‌ రామారావు, టీఆర్‌ఎస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షులు గాండ్ల అశోక్‌, గుండు రవి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: