గుండాల మార్చి18 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని చెట్టు పల్లి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు కంద కలు తీస్తున్నారు అన్న సమాచారం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ పార్టీ నాయకులతో కలిసి చేరుకున్నారు. కందకాలు తీయకుండా అడ్డుకున్నారు. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలనుసారం కందకాలు తీయకుండా అడ్డుకోవడం జరిగింది అన్నారు. ఫారెస్ట్ అధికారులు ఎన్ని సార్లు చెప్పిన వారి తీరు మారటం లేదు అన్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టాలు ఇచ్చే భూముల జోలికి వెళ్లవద్దని కోరామన్నారు. అధికారులు సైతం స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, మైనార్టీ జిల్లా నాయకులు ఎండి. ఆదం, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు, గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: