మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని మొండికుంట గ్రామ పంచాయతీ లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు తెరాస పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, జాలే రామకృష్ణారెడ్డి వారి చేతుల మీదుగా మొండికుంట గ్రామ కాపురస్థులు కామిశెట్టి పిచ్చయ్య గారికి 24000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించటం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, మొండికుంట ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్,గ్రామ అధ్యక్షుడు పాటి మన్మథరెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ కందాల ఈశ్వర్,నాయకులు శ్యామల పుల్లారెడ్డి, పగడాల వెంకటరెడ్డి, వల్లభనేని వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: