- పోడుభూమి సమస్యను పరిష్కరించాలి
- దేవాలయ భూముల వివాదాలను పరిష్కరించాలని మంత్రి ని కోరిన ఎమ్మెల్యే మెచ్చా
మన్యం మనుగడ,చండ్రుగొండ(అన్నపురెడ్డిపల్లి):
అన్నపురెడ్డిపల్లి శ్రీ శ్రీ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన గోడ పత్రిక (వాల్ పోస్టర్) ను బుధవారం హైదరాబాదులోని అరణ్య భవన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలు, అన్నపురెడ్డిపల్లి దేవస్థానం భూముల వివాదాలకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కోరడంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
Post A Comment: