మన్యం మనుగడ మంగపేట.
ఎ.ఎస్.ఎస్.ఆర్. మంగపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేశారు. అసెంబ్లీ సమావేశంలో ఉద్యోగాల ప్రకటనతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ వారు కళాశాల ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ దక్షత గల నాయకుడని, రాష్ట్ర పురోభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న గొప్పనాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వై.రేణుకాదేవి,జె.జ్యోతిర్మయి,ఎం.సంతోష్ కుమార్,ఎస్.అశోక్,సి ఎచ్ శైలేందర్,జి. సతీష్ కుమార్,ఎం.లక్ష్మణ,పి.అనిల్ కుమార్,బోధనేతర సిబ్బంది లక్ష్మీ పాల్గొన్నారు.
Post A Comment: