మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం:అశ్వాపురం మండలం తెరాస పార్టీ కార్యాలయం దెగ్గర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు పినపాక నియోజకవర్గంలోని అన్ని దళిత గ్రామాలలో పర్యటించి వారికీ వచ్చే సంక్షేమ పధకాలు వాటిని ఏవిధంగా అనుభవిస్తున్నారో తెలుసుకోవటం కొరకు నియోజకవర్గంలో అన్ని మండలాల అధ్యక్షులు అనుమతితో ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఉగాది తరువాత మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని, తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని పినపాక నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్ తెలిపారు.ఈకార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గోరుముచ్చు వెంకటరమణ యూత్ అధ్యక్షులు గద్దల రామకృష్ణ సీనియర్ నాయకులు చుంచు రామ్మూర్తి ఆత్మ కమిటీ డైరెక్టర్ కామెర్ల ఆదిలక్ష్మి మండల ప్రచార కార్యదర్శి గడకారి రామకృష్ణ కార్యకర్తలు సంగీతరావు దాసరి దాసు పున్నారావు శివరాములు మేకల భాస్కర్ కాలవ సంసోను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: