మన్యం మనుగడ పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు విరాళంగా అందజేసిన ధనంతో, నూతనంగా నిర్మించిన సమ్మక్క, సారలమ్మ ఆలయంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, దాట్ల వాసుబాబు, యగ్గడి సత్యనారాయణ, ఇతరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: