- చిన్న జీయర్ స్వామి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
- తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడెం బాబు.
మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో శనివారం తుడుందెబ్బ మండల అధ్యక్షులు గుండ్ల పాపారావు,తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోడెం బాబు ఆధ్వర్యంలో చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మను స్థానిక తాసిల్దార్ ఆఫీస్ నుండి కన్నాయిగూడెం సెంటర్ వరకు శవయాత్ర నిర్వహించిన అనంతరం చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మ దహనం చేశారు.అనంతరం పోడెం బాబు మాట్లాడుతూ.శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల పై చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం గా ఉన్నాయని అన్నారు.ఆదివాసీల ఆరాధ్యదైవం అయిన సమ్మక్క సారలమ్మ ను అసలు దేవుళ్లే కాదనడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఆదివాసీల నమ్మకాన్ని కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు.దేశంలో పది కోట్ల మంది భక్తులు ఆరాధించే దైవాన్ని అవమానించడం దేశ సామరస్య తను,సమగ్రతను దెబ్బ తీయడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి పొడెం శోభన్, రాజన్న పేట గ్రామ సర్పంచ్ అల్లెం ప్రభాకర్,తుడుందెబ్బ నాయకులు దబ్బగట్ల సాయి,ఆలం జంపయ్య,పెద్దల లక్ష్మీనారాయణ,ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కురసం శ్రీధర్, విద్యార్థి సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు దబ్బగట్ల శ్రీకాంత్,కోరం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: