గుండాల మార్చి 23(మన్యం మనుగడ) గిరిజనుల ఆరాధ్య దైవ లైన మేడారం సమ్మక్క, సారలమ్మలను కించపరిచేలా మాట్లాడిన చిన్న జీయర్ స్వామి పై చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ మండల అధ్యక్ష కార్యదర్శులు మోకాళ్ల కన్నయ్య, గోవింద నరసింహారావు డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అందులో భాగంగానే బుధవారం మండలంలో బంద్ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం జాతర అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జియర్ స్వామి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు పునెం శ్రీను, చింత వెంకటేశ్వర్లు, మహేందర్, ప్రభాకర్, రాంబాబు, శోభన్ బాబు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: