గుండాల మార్చి 23 (మన్యం మనుగడ) భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలని పి డి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి పృథ్వి, పీ వై ఎల్ రాష్ట్ర నాయకులు వాంకుడోత్ అజయ్ అన్నారు. బుధవారం భగత్ సింగ్, రాజ్ గురు, సుకుదేవ్.91వ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు బ్రిటిష్ ముష్కరులను తరిమికొట్టేందుకు తమ విలువైన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ విముక్తి కోసం పోరాడారని అన్నారు. భగత్ సింగ్ జీవించిన కాలమంతా దేశం కోసం స్వేచ్ఛ కోసం పోరాడారని అన్నారు. భగత్సింగ్ స్ఫూర్తితోనే ఉక్రెయిన్ లో ప్రజలు రష్యాపై పోరాడుతున్నారని వారు అన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని వారు నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రజా పండ మండల కార్యదర్శి శంకరన్న, పి డి ఎస్ యు డివిజన్ కార్యదర్శి నరేష్ , నాయకులు కొమరం శాంతయ్య,పునెం రంగయ్య , జగన్, పాపయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: