CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

త్రీఫేస్ విద్యుత్ లైన్ పనులు పున: ప్రారంభించాలి. సర్పంచ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత.

Share it:

 



మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపురం గ్రామానికి మంజూరైన త్రీఫేస్ విద్యుత్తు లైను పనులకు అటవీ శాఖ అధికారులు ఆటంకం కలిగిస్తున్న విషయం విధితమే బుధవారం ఐలాపురం గ్రామ సర్పంచ్ మల్లెల రాజేశ్వరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.2014 సంవత్సరం ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుండి బీటీ రోడ్డు మంజూరైన ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని అన్నారు.దీనిని కూడా అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో ఈ బిటి రోడ్డు కూడా నిర్మాణం దశలోనే నిలిచిపోయిందని అన్నారు.అదేవిధంగా 2021 సంవత్సరం త్రి ఫేస్ విద్యుత్ లైన్ మంజూరు అయిన దీనిని కూడా అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో ఈ విద్యుత్ పనులు కూడా నిలిచిపోవడం జరిగిందని అన్నారు.అటవీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి మా ఊరికి మంజూరైన బిటి రోడ్డు పనులను,త్రీఫేస్ విద్యుత్తు లైను పనులను పున: ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య యూత్ అధ్యక్షులు ఆలం నగేష్,పీరీల సురేష్,మల్లెల బాలయ్య,

భాస్కర్,వినోద్,గంగాధర్,

సారయ్య,లక్ష్మీనారాయణ,సదానందం,మధు,రవి,వంశీ,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: