మన్యం టివి దుమ్ముగూడెం::
లక్ష్మీ నగరం సెంటర్ లో కేంద్ర ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పిలుపుమేరకు టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఆధ్వర్యంలో నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణా లో పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని,శాసనసభ ఆమోదించి పంపిన గిరిజన రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని,పంజాబ్ తరహా రైతు విధానాన్ని దేశమంతా అమలుచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మీ ప్రధానకార్యదర్శి కణితి రాముడు అధికార ప్రతినిధి Md. జానీపాషా, ఉపాధ్యక్షుడు తునికి కామేశ్వరరావు, కార్యదర్శులు కణితి లక్ష్మణ్, కెల్లా శేఖర్, ప్రచారకమిటి అధ్యక్షులు శ్రీనివాస్, ఎం పి టి సి మడకం రామారావు, తెల్లం భీమరాజు, సోడి తిరుపతిరావు,ఎస్ సి సెల్ నాయకులు జీలకర గంగరాజు,రైతునాయకులు మద్ది రాము,లక్ష్మీనగరం పట్టణ అధ్యక్షుడు డింగి నాగేశ్వర్ రెడ్డి,పొడకల్పల్లి శ్రీను,జీరి సత్యనారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: