CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలి.

Share it:

 



మన్యం మనుగడ వాజేడు మార్చి24.



క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలన చేయాలని వాజేడు మండల కేంద్రంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మంకిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ సోకిన వారిలో కొందరికి క్షయ వ్యాధి లక్షణాలు ఉండటం గమనార్హం,

క్షయ ఒక అంటువ్యాధి. క్షయ రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రోగ క్రిములు ఇతరులకు వ్యాపిస్తాయి. ఎవరికైనా రెండు వారాలకు మించి దగ్గు, కళ్లె, జ్వరం, బరువు, ఆకలి తగ్గుదల ఉంటుంది. దగ్గినప్పుడు క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. అతని ఊపిరితిత్తుల నుంచి వచ్చే కఫం ద్వారా ఈ బాక్టీరియా గాలిలో చేరి, దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలితోపాటు అతని ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి జబ్బుకు పునాది వేస్తుంది. ఉమ్మినప్పుడు రక్తం పడటం వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే ప్రభుత్వాసుపత్రిలో సంప్రందించాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో చేయ వ్యాధి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వాజేడు సి హెచ్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: