మన్యం మనుగడ మంగపేట.
మంగపేట తహశీల్దార్ కార్యాలయం ను మంగళవారం ములుగు ఆర్డీవో కూతాటి రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ఆమె రెవెన్యూ రికార్డులను, రికార్డులను భద్రపర్చే గదిని పరిశీలించారు.ఆపై తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న రెవెన్యూ గెస్ట్ హౌజ్ ను పరిశీలించి వీలైనంత త్వరగా నిర్మాణo పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.అలాగే మంచి నాణ్యత ప్రమాణాలను భవన నిర్మాణంలో పాటించాలని ఆమె కోరారు.దీనికి స్థానిక తహశీల్దార్ సైతం తగిన పర్యవేక్షణ చేయాలని సూచించారు.కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి వెంట స్థానిక తహశీల్దార్ మహమ్మద్ సలీం,ఆర్.ఐ వి.సునీల్,అటెండర్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: