మన్యం మనుగడ కరకగూడెం: మార్చి 28,29 తేదిలలో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మండలంలో విజయవంతం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పధకం కార్మికుల సంఘం(సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసు అందజేశారు.ఈ సందర్భంగా సీఐటటీయూ మండల నాయకులు కొమరం కాంతారావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి తక్షణమే అమలు చేయాలని కరోనా కాలంలో పాఠశాలలు బంద్ ఉన్న కాలానికి మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు చెల్లించాలని గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని అవసరమైన వంట గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలని వంట షెడ్లు వంట పాత్రలు తదితర మౌలిక వసతులు కల్పించాలని కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలి మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలి ప్రభుత్వ బీమా పీఎఫ్ ఈఎస్ఐ ఇలాంటి సౌకర్యం కల్పించాలని కోరుతూ సమ్మెలో సంఘం ఆధ్వర్యంలో లో భాగస్వామ్యం అవనన్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గొగ్గలి సావిత్రి అంకమ్మ పూనెం సాయమ్మ గొగ్గలి భద్ర పులి లలిత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: